ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

Jun 19 2025 4:28 AM | Updated on Jun 19 2025 4:28 AM

ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

శ్రీకాకుళం కల్చరల్‌: శ్రీకాకుళం రూరల్‌ మండలంలోని కల్లేపల్లిలో ఉన్న సంప్రదాయ కూచిపూడి గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకులం డైరెక్టర్‌ స్వాతీ సోమనాథ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కూచిపూడి నృత్యంలో శిక్షణ కోసం 2025–26 ఏడాదికి గాను జూలై 1 నుంచి ప్రవేశశాలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు 98491 07426 నంబరును సంప్రదించాలని కోరారు.

యోగాంధ్ర పోటీల్లో మూడో స్థానం

టెక్కలి: యోగాంధ్ర పోటీల్లో భాగంగా ఇటీవల ఎన్టీఆర్‌ జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పాటల పోటీలు, యోగా పోటీల్లో టెక్కలి సాయికృష్ణా యోగా కేంద్రం గురువు గేదెల చంద్రశేఖర్‌ రాష్ట్రస్థాయిలో మూడవ స్థానంలో నిలిచారు. విజయవాడలో నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవంలో భాగంగా ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, టూరిజం శాఖా మంత్రి దుర్గేష్‌ చేతులమీదుగా చంద్రశేఖర్‌ బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ మేరకు యోగా కేంద్రం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

ముగ్గురు జేఎల్స్‌కు

ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి

శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం జిల్లా నుంచి ముగ్గురు జూనియర్‌ లెక్చరర్లను ప్రిన్సిపాళ్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 28వ తేదీన సీనియారిటీ జాబితా ప్రకారం పదోన్నతలకు అర్హత సాధించిన జేఎల్స్‌ జాబితాను ఇంటర్మీడియెట్‌ విద్య డైరెక్టర్‌ కృతికా శుక్లా ఉత్తర్వులు వెలువరించిన విషయం తెలిసిందే. తాజాగా వారి ఆప్షన్‌ ప్రకారం కౌన్సెలింగ్‌ జరిపి ప్రిన్సిపాళ్లగా నియామక ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. జిల్లా నుంచి బి.చంద్రమౌళి (ఫిజిక్స్‌ లెక్చరర్‌–ప్రభుత్వ జూనియర్‌ కళాశాల,ఆమదాలవలస)ను మెళియాపుట్టి జీజేసీ ప్రిన్సిపాల్‌గా, పి.సౌజన్య (కామర్స్‌ లెక్చరర్‌– ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల,శ్రీకాకుళం)ను బారువ జీజేసీ ప్రిన్సిపాల్‌గా, చింతాడ శరత్‌బాబు (జువాలనీ లెక్చరర్‌– ప్రభుత్వ జూనియర్‌ కళాశాల,మందస)ను ఇచ్ఛాపురం జీజేసీ బాలురు ప్రిన్సిపాల్‌గా నియమించారు. వీరిని పలువురు లెక్చరర్లు, ఉద్యోగులు అభినందించారు.

గ్రంథాలయం అభివృద్ధికి చర్యలు

జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గ్రంథాలయాన్ని ఆధునికంగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (అఅఐ) తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులను అందించేందుకు ముందుకు వచ్చిందని వెల్లడించారు. రాష్ట్రంలోనే ఒక ప్రముఖ మోడల్‌ గ్రంథాలయంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు, పాఠకులకు ఉపయోగపడే సౌకర్యాలతో ఇది స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ గ్రంథాలయంగా అభివృద్ధి చేయబడుతుందన్నారు. ఈ నిధులను జిల్లా పాలనా యంత్రాంగమే వినియోగించనుందని, ఎలాంటి ప్రైవేటీకరణ అంశం ప్రస్తావనకే రాలేదని స్పష్టం చేశారు. గ్రంథాలయం పూర్తిస్థాయిలో ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంటుందని, ఇప్పటికే ప్రజా ఆస్తిగా ఉన్న ఈ గ్రంథాలయం భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుందన్నారు. గ్రంథాలయం ప్రైవేటీకరణ చేస్తారనే అసత్య ప్రచారాలు నమ్మవద్దని తేల్చి చెప్పారు. గ్రంథాలయ అభివృద్ధి పూర్తయిన తర్వాత విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఇది ఎంతో ఉపయోగపడే కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement