స్థలం కబ్జాకు యత్నం | - | Sakshi
Sakshi News home page

స్థలం కబ్జాకు యత్నం

Jun 18 2025 3:05 AM | Updated on Jun 18 2025 3:05 AM

స్థలం కబ్జాకు యత్నం

స్థలం కబ్జాకు యత్నం

టీడీపీ కార్యకర్తపై బాధితుడి ఫిర్యాదు

ఆమదాలవలస: పట్టణ నడిబొడ్డున ప్రధార రహదారి పక్కనే ఉన్న శివాలయం ఎదురుగా తన స్థలాన్ని కబ్జా చేసేందుకు టీడీపీ కార్యకర్త బొడ్డేపల్లి విజయ్‌కుమార్‌ ప్రయత్నిస్తున్నాడని స్థల యజమాని పుల్లేటికుర్తి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వేకువజామున విజయ్‌ తన అనుచరులతో కలిసి జేసీబీ సాయంతో స్థలాన్ని చదును చేసేందుకు యత్నించగా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. తమ్మినేని ప్రసాద్‌ అనే వ్యక్తి పేరుతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి స్థలాన్ని కాజేసే ప్రయత్నం చేస్తున్నాడని, ఈ విషయమై ప్రసాద్‌ను ప్రశ్నించగా తనకేమీ సంబంధం లేదని తెలిపాడని పేర్కొన్నారు. ఈసీ, లింక్‌ డాక్యుమెంట్లు అన్నీ తన పేరుపై (వెంకటరమణ) ఉన్నప్పటికీ కబ్జాదారుడిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. విజయ్‌పై ఇప్పటికి మూడు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఆయన వల్ల ప్రాణహాని ఉందని వాపోయారు. ఎస్పీ, కలెక్టర్‌ గ్రీవెన్స్‌సెల్‌లో సైతం ఫిర్యాదు చేశానని, సమస్య పరిష్కారం కాకుంటే చావే శరణ్యమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement