
రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి
పొందూరు: పొందూరు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి పెద్దకోట నాగేశ్వరరావు(56) అనే వృద్ధుడు మృతి చెందినట్లు సోమవారం జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు. మృతుడిది కోటబొమ్మాళి మండలంలోని పెద్ద బమ్మిడి గ్రామం. విశాఖపట్నం నుంచి రైలులో స్వగ్రామం వస్తుండగా పొందూరు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడినట్లు పేర్కొన్నారు. దీనిపై మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలంలోని హరిశ్చంద్రపురం రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి వయస్సు 45 సంవత్సరాలు ఉండవచ్చునని, నీలం రంగు టీషర్టు, ఆకుపచ్చ రంగు లుంగీ ధరించి ఉన్నాడని తెలిపారు. అతనిపై ఉన్న గాయాలు ఆధారంగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుని వివరాలు ఎవరికై నా తెలిసిస్తే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ షరీఫ్ కోరారు.