
కిమ్స్లో అత్యాధునిక వైద్యసేవలు
అరసవల్లి: జిల్లాలో కిమ్స్ ఆసుపత్రితోనే కార్పోరేట్ వైద్యం పరిచయమయ్యిందని..ఇప్పుడు అదనపు బ్లాక్ ద్వారా మరింత ఆధునిక సౌకర్యాలతో నాణ్యమైన వైద్యాన్ని అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కిమ్స్ ఆసుపత్రి నూతన బ్లాక్ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యాన్ని సామాన్యులకు అందించేలా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పనిచేస్తుందని..రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గిపోకుండా ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియ విజయ, ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, కిమ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, శీనయ్య, కృష్ణయ్య, మెడికల్ డైరక్టర్ డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ డాక్టర్ రవిసంతోష్, క్వాలిటీ మేనేజర్ డాక్టర్ వేద తదితరులు పాల్గొన్నారు.