
● వీరు పుస్తెల దొంగలు
ఒడిశా రాష్ట్రం, గంజాం జిల్లా బరంపురానికి చెందిన సుజిత్కుమార్ పాడి, బాలకృష్ణ సాహు జిల్లాలోని నాలుగు చోట్ల చోరీలకు పాల్పడి ఏడున్నర తులాల బంగారంతో కొత్తూ రు పోలీసులకు చిక్కారు. సుజిత్ గొడవల్లో జైలుకి వెళ్లి బాలకృష్ణకు పరిచయమయ్యాడు. బెయిల్పై విడుదలైన ఇద్దరూ మద్యం, పేకాట వ్యవసనాలకు బానిసై చోరీలకు నెట్టుకున్నారు. బైక్పై వెళ్తూ పుస్తెలు తెంపేసి పారిపోతారు. జిల్లాలో 2016 నుంచి 2024 వరకు 32 నేరాలుచేశారు. పశువులమేత మేపేవాళ్లు, పొలం చూడ టానికి వెళ్లే ఒంటరి మహిళలే వీరి టార్గెట్.
32 కేసులు..
నిత్యం జైలు జీవితమే
అరెస్టు : 10 జనవరి 2025