
సంక్షేమం నిల్.. అవాస్తవాలు ఫుల్
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వంలో సంక్షేమం నిల్.. అబద్ధాలు ఫుల్ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. ‘జగన్ అంటే నమ్మకం....చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కృష్ణదాస్ మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పక్కనపెట్టేసి లోకేష్ రాసిన రెడ్బుక్ రాజ్యాంగం అమలుచేసి ప్రజలకు నరకం చూపించడం సరికాదన్నారు. రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి పాలన చేశామని, చంద్రబాబు వచ్చాక కూటమి నాయకులు దోచుకో దాచుకో అన్న చందంగా పాలన సాగిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ హాయాంలో విద్య, వైద్యం, వ్యవసాయానికి పె ద్ద పీట వేశామని గుర్తు చేశారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా నేటికి రైతులకు రుణాలు లేవని, విత్తనాలు రాలేదని, రైతుభరోసా కేంద్రాలు తలుపులు తీసేవారే లేరని అన్నారు. నాడు–నేడుతో స్కూళ్లను బాగు చేసి పేదలకు ఇంగ్లిష్ మీడియం అందించిన ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందని అన్నారు. అభివృద్ధి ఒక్క చోట ఆగిపోకూడదనే వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారని, కానీ చంద్రబాబు దానిపై లేనిపోని దుష్ప్రచారాలకు ఒడిగట్టారని విమర్శించారు.
మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, వేధింపు లు కూటమి పాలనలో ఎక్కువైపోయాయన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తే, కూటమి పాలనలో తెలుగు
తమ్ముళ్లకు మాత్రమే పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఈ తేడాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కూడా ఈ వి షయాలను వివరించాలన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ, ఎచ్చెర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, వైఎస్సార్ సీపీ తూర్పుకాపు కుల రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, పార్టీ కాళింగకుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల రామారావు, పార్టీ రాష్ట్ర కార్య దర్శి కేవీజీ సత్యనారాయణ, ఆమదావలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి గేదెల పురుషోత్తం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీ, డీసీసీబీ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్లు కరిమి రాజేశ్వరరావు, గొండు కృష్ణమూర్తి, తంగుడు నాగేశ్వరరావు, చల్ల రవి, చంద్రభూషణ్ గుప్తా, ఆరంగి మురళి, రాజాపు అప్పన్న, చింతు రాము, మన్మధ పాల్గొన్నారు.
కూటమిపై దుమ్మెత్తి పోసిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
‘జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు
అంటే మోసం’ పుస్తకావిష్కరణ