
పైడితల్లి అమ్మవారి పండుగలు ప్రారంభం
పొందూరు: మండలంలోని పొందూరు, కృష్ణాపురం, జోగన్నపేట, లక్ష్మీపేట, ఎరుకులపేట, అలబోయినపేట, ఎరుకుల కాలనీ గ్రామాల్లో పైడితల్లి అమ్మవారి పండుగలు ఆదివారంతో ప్రారంభమయ్యాయి. మూడు సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును అందుకున్న డాక్టర్ తిమ్మరాజు నీరజా సుబ్రహ్మణ్యం శిష్య బృందం పొందూరు నెహ్రూ పార్కు ఆవరణలో నృత్య ప్రదర్శన చేసి అలరించింది.
రండి పరిగెడదాం..!
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ఈ నెల 23న శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించే ఒలింపిక్ డే రన్లో ప్రతి ఒక్కరూ భా గస్వామ్యం కావాలని ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కోరారు. పార్జీలకు, రాజకీయాలకు అతీతంగా క్రీడలను చూడాలని కోరారు. ఈనెల 23వ తేదీన శ్రీకాకుళంలో నిర్వహించతలపెట్టిన ఒలింపిక్ డే రన్ నిర్వహణ కోసం విధివిధానాలు, ఏర్పాట్ల కోసం నగరంలోని డీఈఓ కార్యాలయానికి ఆనుకుని ఉన్న జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి, సీఈఓ పి.సుందరరావు, జిల్లా కార్యదర్శి ఎం.సాంబమూర్తి తదితరులు మాట్లాడుతూ ఈనెల 23వ తేదీన ఉదయం 6.30 గంటలకు శ్రీకాకుళం నగరంలోని పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద మొదలయ్యే ఒలింపిక్ డే రన్ ర్యాలీ కళింగ రోడ్, వైఎస్సార్ సర్కిల్, పాలకొండా రోడ్, కృష్ణాపార్క్, డేఅండ్నైట్, అంబేద్కర్ జంక్షన్ మీదుగా కోడిరామ్మూర్తి స్టేడియం వరకు కొనసాగుతుందన్నారు.
ఆదిత్యుని సన్నిధిలో భక్తజనం
అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వా మిని ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. ఆలయ పరిసరాల్లో చాలా మంది వ్యాపారులు తోపుడు బళ్లపై వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఇంతవరకు ఆలయం తరఫున అధికారికంగా ఎలాంటి రుసుములు వసూళ్లు చేయనప్పటికీ దీనిపై ఆలయ ఈఓ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ ఆదివారం ఒక్క రోజున ఒక్కో వ్యాపారాల బండి నుంచి రూ.500, మిగిలిన రోజుల్లో రూ.300 వరకు వసూలు చేసేలా చర్యలు మొదలుపెట్టారు. వ్యాపారులు ఈ తాజా పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివిధ దర్శనాల టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.5,24,200, పూజలు, విరాళాల ద్వారా రూ.1,08,120, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.2.05 లక్షల వరకు ఆదాయం లభించినట్లుగా ఆలయ ఈఓ ప్రసాద్ ప్రకటించారు.
ఆదిత్యుని సన్నిధిలో జస్టిస్ తుషార్రావు
సూర్యనారాయణ స్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గేదెల తుషార్కుమార్ ఆదివారం దర్శించుకున్నారు. ఈయనకు ఆల య సంప్రదాయం ప్రకారం ఆలయ ఈఓ ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం వేదాశీర్వచనాన్ని అందజేసి తీర్థప్రసాదాలను అందజేశారు.
పేకాట శిబిరంపై దాడి
నరసన్నపేట: దేవాది వద్ద కొనసాగుతున్న పేకాట శిబిరంపై నరసన్నపేట పోలీసులు ఆదివారం సాయంత్రం దాడి చేసి పది మందిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.6890 నగదు, ఆరు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు.

పైడితల్లి అమ్మవారి పండుగలు ప్రారంభం

పైడితల్లి అమ్మవారి పండుగలు ప్రారంభం