
పట్టపగలే ఇసుక దందా
పాతపట్నం: ఒడిశాకు ఇసుక యథేచ్ఛగా తరలి వెళ్లిపోతోంది. అక్రమార్కులు పట్టపగలే ఇసుక దందా ను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. ఆంధ్రా నుంచి ఒడిశాకు పట్టపగలే ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక అక్రమంగా పాతపట్నం, బైదలాపురం మీదుగా పర్లాకిమిడి(ఒడిశా)లోకి తరలిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గడంతో పాటు అవినీతి కి పాల్పడుతూ అధికారులు పట్టించుకోవడం లేద నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కువ శాతం టాక్టర్ల ద్వారా ప్రతి రోజు తెల్లవారు జామున 4 గంటల నుంచి రాత్రి 8 గంటల అక్రమంగా తరలిస్తున్నారు. హిరమండలం మండలం భగీరథపురం, రుగడ, కొత్తూరు మండలం నివగాం, పొట్నూరు వంశధారలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తీసుకెళ్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఒడిశాలో ఇసుక ట్రాక్టర్ రూ. 4 నుంచి రూ.4,500 వేలు పలుకుతోంది. ఆంధ్రాలో ఇసుక ట్రాక్టర్ (పాతపట్నం)రూ.1,500 నుంచి రూ.2 వేలు ఉంది. పాతపట్నం జాతీయ రహదారి మీదుగా సరిహద్దు చెక్పోస్ట్ మీదుగా, రుగడ, బైదలాపురం మీదుగా పర్లాకిమిడిలోకి ఇసుక అక్రమంగా వెళ్తోంది. ఇప్పటికై నా మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.