
మేజర్ రామ్గోపాల్నాయుడుకు సత్కారం
శ్రీకాకుళం కల్చరల్: రాష్ట్రపతి చేతుల మీదుగా కీర్తిచక్ర అవార్డు స్వీకరించి తొలిసారి జిల్లాకు విచ్చేసిన సంతబొమ్మాళి మండలం నగరిపెంట గ్రామానికి చెందిన మేజర్ మల్ల రామ్గోపాల్నాయుడును జిల్లా కేంద్రంలోని పెద్దరెల్లివీధిలో ఉన్న జిల్లా మా జీ సైనికుల కమ్యూనిటీ హాలులో ఆదివారం ఘ నంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘ జి ల్లా అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు మాట్లాడు తూ మేజర్ నాయుడు తన జట్టును చాకచక్యంగా ముందుకు నడిపించి ఉగ్రవాదులను మట్టికరిపించారని పేర్కొన్నారు. అనంతరం నాయుడు మాట్లాడుతూ యువత దేశభక్తి అలవర్చుకున్ననాడే మనం సరికొత్త భారతావనిని చూడగలమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ సైనికుల ఫెడరేషన్ చైర్మన్ పి.ఈశ్వరరావు, మెండ నారాయణరావు, పి.శంకరరావు తదితరులు పాల్గొన్నారు.