
● గప్చుప్ దొంగలు
విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన వున్నాన రాంబాబు, శ్రీకాకుళం జి.సిగడాంకు చెందిన గిడిజాల కోటేశ్వరరావుల చోరీ తీరు విభిన్నం. షూ ర్యాక్ల్లోను, ఎలక్ట్రికల్ మీటర్ రీడింగ్ బోర్డుపై, పూల కుండీల్లో, కిటికీ లోపల దాచిన తాళాలను తీసి సులువుగా ఇంట్లోకి చొరబడటం వీరి ప్రత్యేకత. ఇంటిలో ఎక్కడా ఏ వస్తువును టచ్ చేయకుండా.. ఫింగర్ప్రింట్స్ దొరక్కుండా జాగ్రత్త పడతారు. నాలుగైదు తులాలకు మించి దొంగతనం చేయరు. ఏడాది వ్యవధిలో 32 చోరీలకు పాల్పడి మొత్తం 112 తులాల బంగారాన్ని కాజేశారు. వీరిపై 30 కేసులున్నాయి. వీరిలో ఇంటర్ చదవిన రాంబాబుకు మొబైల్ అప్లికేషన్లు, హార్డ్వేర్ వంటి సాంకేతిక పరిజ్ఞానంలో ప్రావీణ్యముంది. మంచి క్రికెటర్ అయిన రాంబాబు రంజీ సెలెక్షన్లలో కోచ్ మోసం చేశాడన్న బాధతో దొంగతనాల వైపు మళ్లినట్టు సమాచారం.
112 తులాలు
కొట్టేసిన ఘనులు
అరెస్టు: 18 జనవరి 2025