వందకొర్రీల వందనం | - | Sakshi
Sakshi News home page

వందకొర్రీల వందనం

Jun 15 2025 7:36 AM | Updated on Jun 15 2025 7:36 AM

వందకొ

వందకొర్రీల వందనం

ఇద్దరుంటే ఒకరికే..

కోటబొమ్మాళికి చెందిన డీవీ రమణకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఒకరు ఏడో తరగతి, మరొకరు ఆరో తరగతి చదువుతున్నారు. ఇద్దరు పిల్లల్లో ఒకరికే పథకం వచ్చింది. మరొకరికి వస్తుందో రాదో కూడా తెలియడం లేదు. గతంలో జవాబుదారీతనం ఉండేది. ఇప్పుడు ఎవరిని అడిగినా సమాచారం లేదంటూ దాట వేస్తున్నారని ఆ తండ్రి

వాపోతున్నారు.

ఆంక్షల ముసుగులో తల్లికి వందనం ఎగనామం

● రూ.3వేల జీతం తీసుకునే సర్పంచ్‌, ఎంపీటీసీలకు మొండిచేయి

అంగన్‌వాడీ తదితర చిరుద్యోగులకు పంగనామం

పథకం ఎగ్గొట్టడమే లక్ష్యంగా నిబంధనలు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

ల్లికి వందనం పథకం లబ్ధిదారులను కుదించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుంది. ఇప్పటికే ఏడాది అయిపోవడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుండటంతో తల్లికి వంద నం పథకాన్ని కొంతమందికి ఇచ్చి, అమలు చేసేశా మని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది. రూ. 3వేల జీతం తీసుకునే సర్పంచ్‌లు, ఎంపీటీసీల దగ్గరి నుంచి రూ.12వేల లోపు జీతం తీసుకునే చిరుద్యోగుల వరకు కోత పెట్టింది. 300యూనిట్ల విద్యుత్‌ బిల్లు వచ్చే వారికి కూడా మొండి చేయి చూపింది.

అంతా గోప్యత..

తల్లికి వందనం లబ్ధిదారుల విషయంలో కూటమి ప్రభు త్వం గోప్యత పాటిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎంతమంది అ ర్హులో క్లారిటీ ఇవ్వడం లేదు. డీఈఓను అడిగితే తనకేం రాలే దని అంటుండగా, సచివాలయం కో ఆర్డినేటర్‌ను అడిగినా అదే సమాధానం వస్తోంది. పంచాయతీల వారీగా అర్హులు, అనర్హుల జాబితాను విడుదల చేశారే తప్ప జిల్లా యూనిట్‌ గా లబ్ధిదారులు ఎంతన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు.

కొందరికే లబ్ధి

ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద రూ.15వేలు ఇస్తామని, లబ్ధి చేకూర్చే విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టేది లేదని, గత ప్రభుత్వంలా రూ.13వేలు కా కుండా పూర్తి స్థాయి మొత్తాన్ని అందజేస్తామని జిల్లా పర్యటనలో చంద్రబాబు, లోకేష్‌, ఆ పార్టీ ప్రస్తుత మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆంక్షలతో పథకాలకు పంగనామం పెడుతున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో చిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అందించారు. ఇప్పుడీ కూటమి రూ.3వేల జీతం తీసుకుంటున్న ప్రజాప్రతినిధులతో పాటు చిరుద్యోగులకు మొండి చేయి చూపారు. జిల్లా వ్యాప్తంగా 6,017మంది అంగన్‌వాడీలకు తల్లికి వందనం అందలేదు. వీరంతా ఈనెల 18న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రభుత్వం మోసం చేసింది

గత ప్రభుత్వం కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో మమ్మల్ని ఉద్యోగులుగా చూపించి తల్లికి వందనం కట్‌ చేసేశారు. ప్రభుత్వం మోసం చేసింది. గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో అమ్మఒడి ఇచ్చారు. రేషన్‌కార్డులు అందించారు. ఇప్పుడీ ప్రభుత్వం సంక్షేమ పథకాలే కాదు రేషన్‌కార్డులు కూడా తొలగిస్తామని చెబుతోంది. పనిభారం చాలా ఎక్కువగా ఉంది. దీనిపై ఈ నెల 18న కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తాం.

– మహంతి కల్యాణి, అంగన్‌వాడీ వర్కర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు

సర్పంచ్‌ పదవి ఉద్యోగమా..?

వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు సర్పంచ్‌లకు అమ్మ ఒడి డబ్బులు వచ్చేవి. కానీ కూటమి ప్రభుత్వం సర్పంచ్‌లను ఉద్యోగులుగా భావించి తల్లికి వందనం పథకానికి అనర్హులను చేసింది. పథకాల డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడం చంద్రబాబుకు తెలిసినంతగా మరే రాజకీయ నాయకునికి తెలియదనడానికి ఇదో నిదర్శనం.

– ముద్దాడ మోహిని, సర్పంచ్‌, దబ్బపాడు,

ఎల్‌.ఎన్‌.పేట

ఆంక్షలు అన్యాయం

అమలు చేయడానికి వంద కొర్రీలు పెట్టి మళ్లీ దానికి తల్లికివందనం అనే పేరు పెట్టడం అన్యాయం. మా పంచాయతీలో సర్పంచ్‌గా ఉన్న నాకు, ఎంపీటీసీగా ఉన్న కై బాడ సుజాతతో పాటు మరో ఇరవై నాలుగు మందికి అనేక కొర్రీలతో డబ్బులు వేయలేదు. తల్లికి వందనం.. కొంతమందికే.. అని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటే బాగుంటుంది.

– చింతు ప్రమీల, సర్పంచ్‌, బెలమరపాలవలస

వందకొర్రీల వందనం1
1/3

వందకొర్రీల వందనం

వందకొర్రీల వందనం2
2/3

వందకొర్రీల వందనం

వందకొర్రీల వందనం3
3/3

వందకొర్రీల వందనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement