
పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలో జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వాణిజ్యపన్నుల వాఖ జాయింట్ కమిషనర్ బుడుమూరు నాగార్జున పాల్గొని సమావేశాన్ని సమన్వయపరిచారు. కొన్ని సంస్థలు జీఎస్టీలో నమోదు కాలేదని, వాటిని పన్ను పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. లీడ్ బ్యాంక్, ఇతర బ్యాంకు అధికారులకు ఆదేశాలిస్తూ జీఎస్టీ అధికారుల నుంచి నోటీసులో జారీ అయిన పన్ను బకాయి దారులకు సంబంధించిన ఖాతా వివరాలను అందించాలన్నారు. అక్రమ రవాణా నిరోధించడానికి మైనింగ్ అధికారులు, రవాణా శాఖ అధికారులు, వాణిజ్య పన్నుల శాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.