‘ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణం’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణం’

Jun 14 2025 10:18 AM | Updated on Jun 14 2025 10:18 AM

‘ప్రభ

‘ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణం’

టెక్కలి: కూటమి ప్రభుత్వం అరాచకవాదానికి సుప్రీంకోర్టు తీర్పు చెంప పెట్టులాంటిదని న్యాయవాది, వైఎస్సార్‌సీపీ నాయకుడు సింగుపురం మోహనరావు అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కేసులో పోలీసులు, కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణమని తెలిపారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ కొమ్మినేనిని తక్షణమే విడుదల చేయాలని ఇచ్చిన తీర్పుతో కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.

మీడియా స్వేచ్ఛపై ఆంక్షలెందుకు..?

టెక్కలి: మీడియా, జర్నలిస్టులకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛకు ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని సీనియర్‌ న్యాయవాది డీవీ వివేకానంద తెలిపారు. ఎక్కడైనా తప్పు చేస్తే చట్టపరమైన చర్యలకు న్యాయస్థానాలను ఆశ్రయించాలి తప్ప అరెస్టులు, దాడులు చేయకూడదని తెలిపారు. సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టును తప్పు పడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీడియా, పత్రికా స్వేచ్ఛపై గౌరవంగా భావించవచ్చని పేర్కొన్నారు.

వృద్ధురాలి మెడలో చైన్‌ చోరీ

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాకేంద్రంలోని పీఎన్‌కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలి మెడలో చైన్‌ తెంపేసి బైక్‌పై ఉడాయించాడు ఓ యువకుడు. రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పీఎన్‌ కాలనీ మూడో లైన్‌ కమల నివాస్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న కల్లేపల్లి ఈశ్వరమ్మ (62) తన సోదరితో కలసి ఫ్రెండ్స్‌ కాలనీలో బంధువులు చనిపోవడంతో పరామర్శకు వెళ్లారు. శుక్రవారం రాత్రి తిరిగి పీఎన్‌కాలనీ రెండో లైన్‌ చేరేసరికి ఓ 30 ఏళ్ల యువకుడు తలకు హెల్మెట్‌ ధరించి రయ్‌మని దూసుకొచ్చి నడుస్తున్న వృద్ధురాలి మెడలో మూడున్నర తులాల చైన్‌ తెంపేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె మెడకు గాయమైంది. దీనిపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పీఎన్‌ కాలనీలో వరుసగా చోరీలు, చైన్‌ స్నాచింగ్‌లు జరుగుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పుస్తెలతాడు చోరీకి విఫలయత్నం

మెళియాపుట్టి: మండలంలోని గోకర్ణపురం గ్రామానికి సమీపంలో అదే గ్రామానికి చెందిన గేదెల మహాలక్ష్మి అనే మహిళ రహదారి నుంచి గ్రామానికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలో పుస్తెలతాడు తెంపుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. శుక్రవారం మహాలక్ష్మీ పెద్దలక్ష్మీపురం గ్రామానికి తన తండ్రి పెద్దకర్మకు వచ్చి తిరుగు ప్రయాణంలో గోకర్ణపురం గ్రామానికి వెళ్తుండగా..ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనం పై వచ్చి మెడలో పుస్తెలతాడు లాగే ప్రయత్నం చేశారు. మహిళ కేకలు వేయడంతో వారు పారిపోయారు. అనంతరం మహిళ మెళియాపుట్టి పోలీసులకు సమాచారం అందించారని తెలియజేశారు.

ఆలిండియా బ్యాడ్మింటన్‌ పోటీలకు అంపైర్‌గా మోహన్‌సాయి

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన యువ బ్యాడ్మింటన్‌ అంపైర్‌ సంపతిరావు మోహన్‌సాయినాథ్‌ మరో ప్రతిష్టాత్మక పోటీలకు అంపైర్‌గా వ్యవహరించనున్నాడు. మహారాష్ట్రలోని పూణే వేదికగా ఈ నెల 14 నుంచి 22 వరకు ఆలిండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌–2025 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు జిల్లాలోని ఎచ్చెర్ల మండలం షేర్‌ మహ్మద్‌పురం గ్రామానికి చెందిన మోహన్‌సాయి అంపైర్‌గా నియామకమయ్యా రు. ఈ మేరకు బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సెక్రటరీ నుంచి నియామక ఉత్తర్వులు అందుకున్నాడు. ఈ పోటీల కోసం శుక్రవారం ఇక్కడ నుంచి పయనమై పూణే చేరుకున్నాడు. మోహన్‌సాయి తండ్రి సంపతిరావు సూరిబాబు జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌కు మూడు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు.

‘ప్రభుత్వం వ్యవహరించిన  తీరు దారుణం’ 1
1/3

‘ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణం’

‘ప్రభుత్వం వ్యవహరించిన  తీరు దారుణం’ 2
2/3

‘ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణం’

‘ప్రభుత్వం వ్యవహరించిన  తీరు దారుణం’ 3
3/3

‘ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement