
పిడుగుపాటుకు నాలుగు ఆవులు మృతి
ఎచ్చెర్ల: లావేరు మండలంలోని బుడుమూరు గ్రామంలో శుక్రవారం ఒంటిగంట సమయంలో ఉరుములతో కూడిన వర్షానికి చెట్టుమీద పిడుగుపడి కిందనున్న నాలుగు ఆవులు మృతి చెందాయి. ఇదే గ్రామానికి చెందిన పిట్ట అప్ప య్య ఓ చెట్టు కింద ఆవులు కట్టి ఉంచారు. ఒక్కసారిగా పిడుగుపడి ఆవులు మృతిచెందడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. రెవెన్యూ సిబ్బంది, పశువైద్యాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తనను ఆదుకోవాల ని రైతు కోరుతున్నారు.
విద్యుత్ షాక్తో
వృద్ధుడు మృతి
రణస్థలం: మండలంలోని కొచ్చెర్ల గ్రామానికి చెందిన గురువిల్లి అసిరయ్య (79) ఈ నెల 11వ తేదీన చెరువు పనికి వెళ్లి విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు జేఆర్ పురం పోలీసులు తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అసిరయ్య బుధవారం చెరువు పనికి వెళ్లి ఉదయం 11 గంటలకు చెరువు పని ముగించుకుని బహిర్భూమికి వెళ్లారు. తదుపరి చెరువు తుప్పలో పడి ఉన్న విద్యుత్ వైరును గమనించకుండా తొక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎవరూ గమనించకపోవడంతో ఆయన కోసం రెండు రోజులు వెతికారు. శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు వృద్ధుడు విద్యుత్ షాక్తో చనిపోయినట్లు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. భార్య అప్పయ్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్ పురం ఎస్ఐ ఎస్. చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.