మెగా ఉద్యోగ మేళాలో 263 మంది ఎంపిక | - | Sakshi
Sakshi News home page

మెగా ఉద్యోగ మేళాలో 263 మంది ఎంపిక

Jun 13 2025 5:03 AM | Updated on Jun 13 2025 5:03 AM

మెగా ఉద్యోగ మేళాలో 263 మంది ఎంపిక

మెగా ఉద్యోగ మేళాలో 263 మంది ఎంపిక

కాశీబుగ్గ: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ సూర్యతేజ జూనియర్‌ కళాశాల ఆవరణలో గురువారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. 763 మంది హాజరుకాగా అందులో 263 మంది వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్నచౌదరి మాట్లాడుతూ జాబ్‌ మేళాకి హాజరైన ప్రతి నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాల ప్రి న్సిపాల్‌ కరస్పాండెంట్‌ పద్మాజీ కామేశ్వరరావు మాట్లాడుతూ యువతలో ఉండాల్సిన నైపుణ్యాల ప్రాముఖ్యత గురించి వివరించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయికుమార్‌ మాట్లాడు తూ దూరంతో సంబంధం లేకుండా అభ్యర్థులు అ వకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కా ర్యక్రమంలో ఎల్‌.కామేశ్వరరావు, పి.విఠల్‌రావు, బి.నాగరాజు, గాలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement