పశువుల తరలింపు అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

పశువుల తరలింపు అడ్డగింత

Jun 13 2025 5:01 AM | Updated on Jun 13 2025 5:03 AM

నరసన్నపేట: జాతీయ రహదారిపై అక్రమంగా గేదెలను తరలిస్తుండగా నరసన్నపేట పోలీసులు అడ్డుకున్నారు. బరంపురం నుంచి రాజమండ్రికి బొలెరే వ్యాన్‌లో ఐదు గేదెలను తరలిస్తుండగా మడపాం టోల్‌గేట్‌ వద్ద తనిఖీలు చేస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించా రు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో వాహనాన్ని సీజ్‌ చేశారు. గేదెలను అలమండ గోశాలకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు.

నీలమణి దుర్గ హుండీ ఆదాయం రూ.4.95 లక్షలు

పాతపట్నం: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి హుండీ కానుకల ద్వారా రూ.4,95,520 ఆదాయం లభించింద ని ఆలయ ఈఓ టి.వాసుదేవరావు తెలిపారు. 30 రోజులకు ఈ ఆదాయం వచ్చిందన్నారు. ఆలయ హుండీని గురువారం లెక్కించామని, టెక్కలి గ్రూపు దేవాలయాలు కార్యనిర్వహణా ధికారి టి.పి.మనస్వి పర్యవేక్షించారన్నారు. కా ర్యక్రమంలో సుదర్శన్‌, శ్రీ వెంకటేశ్వరస్వామి సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

తప్పిన ప్రమాదం

కొత్తూరు: కొత్తూరులోని పాలకొండ రోడ్డులో త్రినాథ స్వామి ఆలయం వద్ద ఏర్పడిన భారీ గోతిలో గురువారం ఓ ఆటో దిగబడింది. వ ర్షం కారణంగా గోతుల్లో నీరు చేరడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పడిపోయిన సమయంలో ఆటో వెనుక ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

ముగ్గురు తహసీల్దార్లకు బదిలీ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో ముగ్గురు తహసీల్దార్లకు బదిలీ చేస్తూ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరే ట్‌ జి–సెక్షన్‌ సూపరింటెండెంట్‌ జి.ఎల్‌.శ్రీనివాస్‌ను లావేరు తహసీల్దార్‌గా నియమించారు. పాతపట్నం తహసీల్దార్‌ సన పల కిరణ్‌కుమార్‌ రణస్థలం మండలం బదిలీ చేశారు. రణస్థలం తహసీల్దార్‌గా పనిచేసిన ఎం.ప్రసాదరావును పాతపట్నం తహసీల్దార్‌ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

రెండు ఆలయాల్లో చోరీ

శ్రీకాకుళం రూరల్‌: మండల పరిధిలోని కనుగులవానిపేట గ్రామంలో గల పొదిలాపు అమ్మ వారి గుడితో పాటు పక్కనే గల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత దొంగతనం జరిగింది. గురువారం ఉదయం ఆలయానికి వెళ్లిన పురోహితుడు తలుపులు బార్లా తెరిచి ఉండడడంతో గ్రామస్తులకు విషయం చేరవేశారు. వారు వెంటనే శ్రీకాకుళం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దొంగతనంలో రూ.2వేలు నగదుతో పాటు ఇతర త్రా వస్తువులు దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. గ్రామస్తులురాలు కనుగుల అశ్విని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్‌ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో

వ్యక్తికి గాయాలు

టెక్కలి రూరల్‌: స్థానిక ఇందిరాగాంధీ జంక్షన్‌ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోదండరామ వీధికి చెందిన బలగ కృష్ణారావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఇందిరాగాంధీ జంక్షన్‌ నుంచి అంబేడ్కర్‌ జంక్షన్‌ వైపు కృష్ణారావు సైకిల్‌పై వెళ్తుండగా అదే మార్గంలో వస్తున్న లారీ సైకిల్‌ హ్యాండిల్‌కు తగలడంతో కృష్ణారావు తుళ్లి పడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ వెళ్లిపోయాడు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి కేసునమోదు చేయనున్నట్లు తెలిపారు.

పశువుల తరలింపు అడ్డగింత 1
1/1

పశువుల తరలింపు అడ్డగింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement