
రాజకీయ క్రీడకు కోచ్ బలి
●ఎందరినో తీర్చిదిద్దాను
నేను ఎందరో క్రీడాకారులను హాకీ క్రీడలో తీర్చి దిద్దాను. 8 మందిని జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలో 70 మందిని ఆడించాను. జిల్లా కేంద్రంలో కూడా పాత్రునివలస మినీ స్టేడియంలో నా అధ్యక్షతన ఆడించాను. పాత్రునివలసలో స్టేడియం అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. ఇప్పుడు జిల్లా కేంద్రంలోని ఏ మైదానానికి వెళ్దామన్నా నన్ను రానీయడం లేదు. స్థానికంగా గల స్పోర్ట్స్ అధికారులు తమపై రాజకీయ ఒత్తిడి ఉందని, స్టేడియంకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. – అల్లు అనిల్ కుమార్, హాకీ కోచ్
శ్రీకాకుళం రూరల్:
ఆయన మారుమూల ప్రాంతానికి మైదానం తీసుకువచ్చారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించి నిఖార్సయిన హాకీ క్రీడాకారులుగా తయారు చేశా రు. జాతీయ స్థాయి పోటీలకు అంపైర్గా వ్యవహరించి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు. కానీ ఇప్పుడు ఆయనను ఆ మైదానానికే రానివ్వడం లేదు. వైఎస్సార్ సీపీపై అభిమానం చూపించారనే కారణంతో కక్ష సాధిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని చాపురం పంచాయతీ అదే గ్రా మానికి చెందిన అల్లు అనిల్కుమార్ హాకీ క్రీడాకారుడు. 15 ఏళ్లుగా ఇదే క్రీడలో ప్రావీణ్యం పొంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. జాతీయ స్థాయి పోటీలకు అంపైర్గా, టెక్నికల్ అధికారిగా కూడా ఎంపికయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనపై కక్ష సాధింపులకు దిగారు. దీంతో ఆయన ఇప్పుడు ఏకంగా ఆటకే దూరమయ్యారు. తనను ఏ మైదానంలోకి రానివ్వకుండా టీడీపీ నేతలు అధికారుల సాయంతో కుట్రలు పన్నుతున్నారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
జాతీయ స్థాయి హాకీ క్రీడాకారుడిపై టీడీపీ నేతల కక్ష సాధింపు
స్టేడియంకు రాకుండా అడ్డుకుంటున్న వైనం

రాజకీయ క్రీడకు కోచ్ బలి