
డ్వాక్రా డబ్బు స్వాహా..?
ఆమదాలవలస: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి 12వ వార్డు లక్ష్మీనగర్ వీధికి చెందిన మెప్మా ఆర్పీ లక్షల రూపాయల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు చెందిన పొదుపు మొత్తాలను స్వాహా చేసిన ట్లు సమాచారం. ఆ వార్డు పరిధిలో సుమారు 50 గ్రూపులకు చెందిన పొదుపు మొత్తాలను గత కొన్నేళ్లుగా వసూళ్లు చేసినట్లు సమాచారం. అయితే ఆ మొత్తాలను బ్యాంకు ఖాతాలకు జమ చేయకుండా ఆమె సొంతానికి వాడుకున్నారని గ్రూపు సభ్యులు ఆరోపిస్తున్నారు. రూ.6–7లక్షల వరకు వసూలు చేసి ఉండవచ్చని సమాచారం. మహిళలు కొంతమంది నిలదీస్తుండడంతో ఇటీవల ఆమె ఇంటికి తాళం వేసుకొని వేరే చోటుకు వెళ్లిపోయినట్లు తెలి సింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు మహిళా సంఘాల సభ్యు లు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై మెప్మా పీడీ ఎస్వీ రమణను సంప్రదించగా దీనిపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.
ఏటీఎం కార్డు మార్చి
రూ.29 వేలు లూటీ
టెక్కలి రూరల్: తన ఏటీఎం కార్డు మార్చి తన అకౌంట్లో నగదు కాజేశారని ఓ మహిళ టెక్కలి పోలీసులను ఆశ్రయించారు. అయితే నాలుగు రోజులుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె వాపోతున్నారు. బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని భగవాన్పురం గ్రామానికి చెందిన నార లోలాక్షి అనే మహిళ గత నెల 20 వ తేదీన టెక్కలిలో గల ఓ ఏటీఎంలో డబ్బులు తీసేందుకు వెళ్లారు. డబ్బులు ఎలా తీయాలో తెలియకపోవడంతో వెనుక ఉన్న గుర్తు తెలియని వ్యక్తికి తన ఏటీఎం కార్డు ఇచ్చి రూ.7000 నగదును తియ్యమని తన పిన్ నంబర్ చెప్పారు. ఆ వ్యక్తి ఏటీఎం నుంచి నగదు తీసి కార్డు మార్చేశాడు. అనంతరం ఈ నెల 6వ తేదీన కార్డులో రూ.7వేలు తీసినట్లు మెసేజ్ రావడంతో ఆమె ఆందోళనకు గురై బ్యాంకుకు వెళ్లారు. అకౌంట్ నుంచి మొత్తం రూ.29వేల నగదును పలాసలో ఓ ఏటీఎం నుంచి తీశారని చెప్పడంతో ఆమె ఈ నెల 8న టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె తెలిపారు. ఇదే విషయమై టెక్కలి సీఐ ఎ.విజయ్కుమార్ వద్ద ప్రస్తవించగా ఈ విషయం తన దృష్టికి రాలేదని, వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.