
28.550 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు
కంచిలి: మండల కేంద్రంలోని సోంపేట రైల్వేస్టేషన్ క్వార్టర్స్ సమీపంలో బీహార్కు చెందిన ఇద్దరు వ్యక్తులు 28.550 కిలోల గంజాయిని తరలిస్తుండగా కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం ఉదయం చాకచక్యంగా పట్టుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం ఈ విషయమై సోంపేట సీఐ బి. మంగరాజు, స్థానిక ఎస్ఐ ిపి.పారినాయుడులు విలేకరులతో మాట్లాడారు. పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం.. బీహార్ రాష్ట్రం రఘునాథ్పూర్ గ్రామాని కి చెందిన అమెరికన్ పాశ్వాన్, కామేంద్ర రామ్లు గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఒడి శా రాష్ట్రం గజపతి జిల్లా మీరాపల్లి గ్రామానికి చెందిన సంజిట్ అలియాస్ బబ్లు అనే వ్యక్తి నుంచి 28కిలోల 550 గ్రాముల గంజాయిని కొనుగోలు చేసి బీహార్ బయల్దేరారు. అక్కడ గయా రైల్వేస్టేషన్కు తీసుకెళ్లి సాహిద్ ఆలం అలియాస్ అర్జున్కు అప్పగించడానికి వీరు ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. దీని కోసం గురువారం వేకువజామున 4 గంటలకు ఇచ్ఛాపురం వద్ద సుమండి వరకు వచ్చి అక్కడి నుంచి హైవేలో గల లారీ ఎక్కి కంచిలి ఫ్లై ఓవర్ వద్ద దిగి, అక్కడి నుంచి కంచిలిలో రైల్వేస్షేన్ చివరన గల రైల్వే క్వార్టర్స్ వద్ద గల రైల్వేపార్క్కు ఎడమ పక్కన గల బీటీ రోడ్డుపైకి 7.30 గంటలకు చే రుకుని గంజాయితో గల నాలుగు బ్యాగులతో హౌరా మెయిల్ ట్రైన్ కోసమై వేచి ఉండగా పోలీసులకు అనుమానం వచ్చి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 28 కిలోల 550 గ్రామలు గంజాయిని, ఒక కీ ప్యాడ్ మొబైల్ ఫోన్ను సీజ్ చేసినట్లు తెలిపారు. గంజాయి ముఠాను పట్టుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించినట్లు సీఐ మంగరాజు ఈ సందర్భంగా తెలిపారు.