
ఆదిత్యాలయ ఈఓ బాధ్యతల స్వీకరణ
అరసవల్లి: రాష్ట్ర దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయాలకు కొత్తగా ఆస్తులను సమకూర్చేలా చర్యలు చేపడతామని, త ద్వారా ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామని ఆలయ ఈఓ కేశవమఠం నాగవెంకట దుర్గా వరప్రసాద్ స్పష్టం చేశారు. అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వా మి ఆలయానికి కొత్త ఈఓ (డిప్యూటీ కమిషనర్)గా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కుటుంబసమేతంగా ఆదిత్యుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆల య సిబ్బంది కలిసి గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం కొత్త ఈఓ ప్రసాద్ మా ట్లాడుతూ అరసవల్లి ఆలయానికి కూడా పరిసర ప్రాంతాల్లో భూముల కొనుగోలు అంశం పెండింగ్లో ఉన్నట్లుగా సమాచారం ఉందని, దీన్ని త్వరితగతిన పూర్తి చేయించి తద్వారా ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని ప్రకటించారు. భక్తులకు ఆలయ పరిసరాల్లో ఎక్కడైనా అసౌకర్యం కలిగితే నే రుగా తనను సంప్రదించవచ్చునని స్పష్టం చేశారు.