తడ‘బడి’న పాఠం | - | Sakshi
Sakshi News home page

తడ‘బడి’న పాఠం

Jun 29 2025 3:05 AM | Updated on Jun 29 2025 3:05 AM

తడ‘బడ

తడ‘బడి’న పాఠం

ఇది అగళి మండల పరిధిలోని కంబదపల్లి ప్రాథమిక పాఠశాల. 1 నుంచి 5 వరకు తరగతులు నిర్వహిస్తున్నా... ఇక్కడ ఈ విద్యా సంవత్సరం నాలుగో తరగతిలో వర్షిణి అనే విద్యార్థిని మాత్రమే చేరారు. ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయుడు రవి చిన్నారికి పాఠాలు చెబుతున్నారు. గ్రామంలో 1,2 తరగతుల విద్యార్థులు చాలా మంది ఉన్నా... వారంతా సమీపంలోని మధుడి గ్రామంలో ఉన్న ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్నారు.

అగళి మండల పరిధిలోని ఐ.తోణసన్నపల్లి గ్రామంలోని పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు వీరు. ఇక్కడ ముగ్గురు విద్యార్థులుండగా.. ఒక ఉపాధ్యాయురాలు పాఠాలు చెబుతున్నారు. అలాగే నందరాజన్నపల్లి గ్రామంలోనూ నలుగురు విద్యార్థులుండగా.. ఒక ఉపాధ్యాయురాలిని ప్రభుత్వం నియమించింది.

అగళి: కూటమి సర్కార్‌పై తల్లిదండ్రులకు ఉన్న నమ్మకానికి ఈ రెండు చిత్రాలు అద్దం పడుతున్నాయి. వైఎస్‌ జగన్‌ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగా, ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు. కానీ కూటమి సర్కార్‌ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తుండటంతో ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లు కళకళలాడుతుండగా... సర్కారు బడులు వెలవెలబోతున్నాయి.

తడ‘బడి’న పాఠం 1
1/1

తడ‘బడి’న పాఠం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement