
అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఎమ్మెల్యే అడు!్డ
సాక్షి టాస్క్ఫోర్స్: రాప్తాడులో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ జరగకుండా ఎమ్మెల్యే అడ్డుపడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పాంప్లేట్లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ప్రొఫెసర్ సాకే రాజేష్ కుమార్ పేర్లు ముద్రించడాన్ని సహించలేక కక్షసాధింపులకు దిగినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఆదేశాలతో నిర్వాహకులకు అధికారులు నోటీసు లిచ్చి కార్యక్రమాన్ని నిలిపివేయించారు. వివరాలు.. రాప్తాడులో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భీమ్ రావ్ యువజన సంఘం నాయకులు 2021 ఏప్రిల్లో తీర్మానం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం ముందు విగ్రహ ఏర్పాటుకు తహసీల్దార్, ఎంపీడీఓ అనుమతి తీసుకున్నారు. విగ్రహ ప్రతిష్ట కోసం చందాలు వసూలు చేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రూ.2 లక్షలు, శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలానికి చెందిన ప్రొఫెసర్ సాకే రాజేష్ కుమార్ రూ.7 లక్షల విరాళం అందించారు. పలువురి ద్వారా మొత్తం రూ.15 లక్షలు వసూలు చేసిన భీమ్ రావ్ యువజన సంఘం నాయకులు రాప్తాడులో విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆదివారం ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. నెల క్రితమే ఉత్సవానికి సంబంధించి పాంప్లేట్లు కొట్టించి అందరికీ పంచారు.
ఆ రెండు పేర్లు తొలగించండి..!
విగ్రహావిష్కరణ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహోదగ్రులైనట్లు తెలిసింది. అధికారులకు ఫోన్ చేసి మండిపడినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, సాకే రాజేష్ కుమార్ పేర్లు ఉండకూడదని ఆదేశించడంతో అధికారులు ఆగమేఘాలపై స్పందించారు. ఎలాగోలా కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో విగ్రహ ఏర్పాటుకు పర్మిషన్ లేదంటూ నిర్వాహకులకు పోలీసుల ద్వారా నోటీసులు ఇచ్చారు. పర్మిషన్ తీసుకుని పనులు చేసుకోవాలని, లేని పక్షంలో అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించినట్లు తెలిసింది.
పార్టీలకతీతంగా
విగ్రహాన్ని ఏర్పాటు చేశాం..
నోటీసులపై భీమ్ రావ్ యువజన సంఘం అధ్యక్షుడు కటిక జయరామ్, వైస్ ప్రెసిడెంట్ బాల నాగేంద్ర విలేకరులతో మాట్లాడారు. 2021 నుంచి పనులు జరుగుతున్నా అధికారులు ఏనాడూ అడ్డు చెప్పలేదన్నారు. పార్టీలకతీతంగా చందాలు వసూలు చేశామన్నారు.పాంప్లేట్లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ప్రొఫెసర్ రాజేష్ కుమార్ పేర్లు తొలగించి కార్యక్రమాన్ని చేసుకోవచ్చని సమాచారమిచ్చారన్నారు. సర్పంచు సాకే తిరుపాల్, పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ కుమార్ కూడా దళితులే అని, అయినా విగ్రహ ప్రతిష్టకు అనుమతి లేదంటూ అడ్డు పడడం దళిత జాతికే సిగ్గు చేటన్నారు.
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ప్రొఫెసర్ రాజేష్కుమార్ పేర్లు
ఉండటంతో కక్ష సాధింపు
రాప్తాడులో ఆగిపోయిన
విగ్రహ ప్రతిష్టాపనోత్సవం