
కుళ్లాయిస్వామి గోవిందా
● ప్రథమ దర్శనంతో పులకించిన భక్తులు
నార్పల: గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తిరుమల కొండన్న వంశీయులు కుళ్లాయిస్వామి పీరును భద్రపరిచే పెట్టెను కిందకు దింపి.. సుగంధ ద్రవ్యాలతో శుభ్రం చేశారు. కుళ్లాయిస్వామి ప్రతిమకు, అగ్ని గుండానికి ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరి దివిటీల వెలుగులో, సన్నాయి వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలు, బంగారు గొలుసుల నడుమ కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం భక్తులకు కల్పించారు.

కుళ్లాయిస్వామి గోవిందా