
ధర పెరిగినా..తగ్గేదేలే!
ఈ రోజు కొంటే మంచిదని
అక్షయ తృతీయ రోజున బంగారు కొంటే మంచిదని చిన్న బంగారు డాలర్ కొన్నా. బంగారు కొనడం వల్ల నష్టమేమీ ఉండదు. అయితే ప్రస్తుతం బంగారు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాస్తవానికి ఇప్పుడు సామాన్యులు కొనలేని పరిస్థితి. కానీ ఈ రోజు కొంటే మంచిదని కొన్నా. ఇంట్లో వారు కూడా సెంటిమెంట్ను కాదనలేక డబ్బులిచ్చారు.
–రజని, పరిగి
కలిసి వస్తుందని కొన్నా
అక్షయ తృతీయ రోజున బంగారు, వెండి కొంటే కలిసి వస్తుందని చెబుతుంటారు. అందుకే ముక్కెర కొన్నా. ఈ పండుగ రోజునే కొనాలని చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నా. ఇప్పుడున్న ధరలకు కొత్త నగలు కొనే పరిస్థితి లేదు. బంగారు, వెండి ధరలు బాగా పెరిగిపోయాయి, సామాన్య ప్రజలు ముట్టుకోలేని పరిస్థితి ఉంది.
– భూదేవి, చెర్లోపల్లి
హిందూపురం: సెంటిమెంట్ ముందు...బంగారం ధర చిన్నబోయింది. తులం బంగారం రూ.లక్ష చేరువలో ఉన్నా...అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే శుభం కలుగుతుందని, సంపద పెరుగుతుందన్న ఆలోచనతో అరకాసైన కొందామని మహిళలు ఉత్సాహం చూపారు. ఫలితంగా ఇన్నాళ్లూ బోసిపోయిన బంగారు నగల దుకాణాలు బుధవారం కళకళలాడాయి.
జోరందుకున్న కొనుగోళ్లు
బుధవారం జిల్లాలోని ధర్మవరం, హిందూపురం, కదిరి, పుట్టపర్తి తదితర ముఖ్య పట్టణాల్లో బంగారు, వెండి కొనుగోళ్లు జోరందుకున్నాయి. కొన్నిదుకాణాల వారు ప్రత్యేక డిస్కౌంట్లు పెట్టడంతో కొనుగోళ్లు కాస్త ఊపందుకున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా బంగారు దుకాణాల్లో చాలా రోజుల తర్వాత రద్దీ కనిపించింది. కొత్త కోడళ్లు, కుమారైలకు బంగారు ఆభరణాలను కొనివ్వడానికి చాలామంది ఆసక్తి చూపించారు. ధర ఎక్కువగా ఉండటంతో చాలా మంది గ్రాము, అరగ్రాముతో సరిపెట్టుకున్నారు. ఈసారి హిందువులతో పాటు ముస్లిం మహిళలు కూడా భారీగా తరలివచ్చి బంగారు నగలు కొనుగోలు చేయడం విశేషం.
బంగారు దుకాణాల్లో
అక్షయ తృతీయ సందడి
సెంటిమెంట్తో దుకాణాల బాట పట్టిన మహిళలు
పెరిగిన ధరతో గ్రాము, అరగ్రాముతో సరిపెట్టుకున్న వైనం

ధర పెరిగినా..తగ్గేదేలే!

ధర పెరిగినా..తగ్గేదేలే!

ధర పెరిగినా..తగ్గేదేలే!