
14, 15 తేదీల్లో జాతీయ పన్ను సదస్సు
నెల్లూరు(టౌన్): నేషనల్ ట్యాక్స్ కాన్ఫరెన్స్, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ఆధ్వర్యంలో ఈనెల 14, 15 తేదీల్లో నెల్లూరులోని డీఆర్ ఉత్తమ్ హోటల్లో జాతీయ పన్ను సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. గురువారం నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోని సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ కార్యాలయంలో సదస్సుకు సంబంధించి వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదస్సుకు సంస్థ జాతీయాధ్యక్షుడు సమీర్ జానీ, హైకోర్టు న్యాయమూర్తి ఎన్.జయసూర్య, స్టేట్ జీఎస్టీ కమిషనర్ రవిశంకర్, అదనపు కమిషనర్ జేవీఎం శర్మ తదితరులు హాజరవుతారన్నారు. జిల్లాలోని వ్యాపార, వాణిజ్య వర్గాలు, ఆడిటర్లు, కల్సల్టెంట్లు, ట్యాక్స్ అడ్వకేట్లు తదితరులు రిజిస్టర్ చేసుకుని సదస్సులో పాల్గొనాలన్నారు. సీనియర్ సీఏ పప్పు మధుసూధన్, సీనియర్ ట్యాక్స్ అడ్వకేట్ పాండురంగయ్య, సీనియర్ ఆడిటర్ కోట సూర్యప్రకాశంను సత్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు ఎం.సుబ్బారావు, కోటసునీల్కుమార్, వెంకటేశ్వరరావు, ఏవీఎస్ కృష్ణమోహన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
వెంకటాచలం: టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని తాటిపర్తిపాళెం సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. తాటిపర్తిపాళె ం గ్రామానికి చెందిన గుమ్మా వెంకటరమణయ్య (48) బైక్పై వస్తుండగా.. తాటిపర్తిపాళెం సమీపంలో గోశాల నుంచి వస్తున్న టిప్పర్ వేగంగా బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వెంకటరమణయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంకటరమణయ్యకు భార్య సుభాషిణి, ముగ్గురు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

14, 15 తేదీల్లో జాతీయ పన్ను సదస్సు