
నెల్లూరు రైల్వేస్టేషన్లో వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): అనారోగ్యంతో గుర్తుతెలియని వ్యక్తి నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం నంబర్ 4పై గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. మృతుడు సుమారు 35 నుంచి 40 ఏళ్లలోపు వయసు కలిగి నలుపు రంగు హాఫ్ హ్యాండ్స్ టీషర్టు, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. దీనిపై సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుని వివరాలు తెలిసిన వారు నెల్లూరు రైల్వే పోలీసులకు తెలియజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
డీసీఏఓగా తిరుపాల్రెడ్డి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లా సహకార ఆడిట్ అధికారిగా కె.తిరుపాల్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన గురువారం స్థానిక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీసీఏఓగా విధులు నిర్వహిస్తున్న తిరుపతయ్య నరసరావుపేటకు బదిలీ కావడంతో కావలి డివిజనల్ సహకార అధికారిగా పనిచేస్తున్న తిరుపాల్రెడ్డిని నియమించారు. దీంతో ఆయన డీసీఓ గుర్రప్పను మర్యాదపూర్వకంగా కలిశారు.

నెల్లూరు రైల్వేస్టేషన్లో వ్యక్తి మృతి