
తల్లికి వందనంపై బంతాట
తల్లికి వందనంలో భాగంగా విద్యార్థుల తల్లి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమయ్యాయనే ప్రచారంతో పాఠశాలలకు పరుగులు తీశారు. ఉపాధ్యాయులను ఆరాతీయగా, సచివాలయాల్లో అడగాలని సెలవిచ్చారు. అక్కడికెళ్లినా నిరాశే ఎదురైంది. తమకెలాంటి సమాచారం లేదని వారు చెప్పడంతో అటూ.. ఇటూ ప్రదక్షిణలు చేశారు. దీనిపై జీఓను రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం జారీ చేసినా, అందులో దరఖాస్తు నమోదు అనే అంశంపై ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు పథకంలో భాగంగా ప్రతి బిడ్డకూ రూ.15 వేలను అందజేస్తామని చెప్పినా, ప్రస్తుతం రూ.13 వేలనే ఇచ్చి, పాఠశాలల నిర్వహణకు మిగిలిన మొత్తాన్ని మినహాయిస్తారనే ప్రచారం జరుగుతోంది.