
వైఎస్సార్సీపీ నేతలు కేసులకు భయపడరు
నెల్లూరు (స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వం అబద్ధపు, బలవంతపు వాంగ్మూలాలతో పెట్టే కేసులకు వైఎస్సార్సీపీ అభిమాని కూడా భయపడడని, ఆ కోణంలోనే మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిపై పెట్టిన అక్రమ కేసు న్యాయస్థానంలో నిలబడదని వైఎస్సార్సీపీ పీఏసీ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న కాకాణి గోవర్ధన్రెడ్డిని శనివారం ములాఖత్లో కలిసి పరామర్శించిన అనంతరం ఎమ్మెల్సీ, నెల్లూరుసిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయ్కుమార్రెడ్డి తదితర నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై ఎప్పుడో ఉన్న చిన్న చిన్న కేసులను సైతం వెలికితీసి రాద్ధాంతం సృష్టించడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. రోజురోజుకు మరింత బలపడుతుందన్నారు. ఇంత సులువుగా తప్పుడు కేసులు పెట్ట వచ్చని కూటమి ప్రభుత్వం నిరూపించిందని, ఇదే పరిస్థితి రేపు ఆ పార్టీ నేతలకు కూడా వర్తిస్తుందని హెచ్చరించారు. అధికారంలో ఉండి చేస్తున్న అరాచకాలకు ప్రజలే రోడ్లపైకి వచ్చి నిలదీసే రోజు వస్తుందన్నారు. అక్రమాలను ప్రశ్నించిన కాకాణిపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేశారని, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తే ఆ పార్టీ బలహీన పడుతుందని అనుకోవడం పొరపాటేనన్నారు. ఏడాది పాలనలో అధికార పార్టీ నాయకులే ప్రజల ముందుకు రావడానికి వెనుకాడుతున్నారన్నారు.
ధైర్యంగా ఉండండి..
కాకాణి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కాకాణి కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి భరో సా ఇచ్చారు. నగరంలోని డైకాస్రోడ్డులో ఉన్న కాకాణి నివాసానికి శనివారం వెళ్లి కుమార్తె కాకాణి పూజితను పరామర్శించారు. సజ్జల మాట్లాడుతూ కాకాణిపై అక్రమ కేసులు బనాయించారని, న్యాయస్థానాల్లో క్లీన్చిట్ లభిస్తుందన్నారు. ప్రభుత్వ అక్రమాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయా లని కోరినందుకే కూటమి ప్రభుత్వం కాకాణిపై అక్రమ కేసును బనాయించిందన్నారు. నిర్దోషిగా కాకాణి బయటకు వస్తారన్నారు.
తారస్థాయికి చేరిన కూటమి
దాష్టీకాలు, పోలీసుల అరాచకాలు
కాకాణిపై పెట్టినవి తప్పుడు కేసులే.. న్యాయస్థానంలో నిలబడదు
వైఎస్సార్సీపీ పీఏసీ కో ఆర్డినేటర్
సజ్జల రామకృష్ణారెడ్డి