
ఉత్సాహంగా సాఫ్ట్బాల్ పోటీలు
వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్యూ)లో జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు రెండో రోజైన గురువారం ఉత్సాహంగా సాగాయి. ఉదయం 6.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మ్యాచ్లను నిర్వహించారు. వర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు, ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత తదితరులు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. రెండో రోజు 19 మ్యాచ్లు జరిగాయి.
సందడే సందడి
టోర్నమెంట్లో భాగంగా గురువారం రాత్రి వీఎస్యూ క్రీడా ప్రాంగణంలో క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేశారు. ఇందులో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు నృత్యాలు చేశారు.

ఉత్సాహంగా సాఫ్ట్బాల్ పోటీలు