ఉగ్ర ఘటన దురదృష్టకరం | - | Sakshi
Sakshi News home page

ఉగ్ర ఘటన దురదృష్టకరం

May 1 2025 12:10 AM | Updated on May 1 2025 12:10 AM

ఉగ్ర ఘటన దురదృష్టకరం

ఉగ్ర ఘటన దురదృష్టకరం

పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరిగ మురళి, ఆనం విజయకుమార్‌రెడ్డి

కావలి: కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రమూకల పాశవిక కాల్పుల్లో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్‌ మరణించడం దురదృష్టకరమని, ఆయన మృతి కుటుంబానికి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నా యకులు అన్నారు. బుధవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ మేరిగ మురళి, కావలి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నెల్లూరురూరల్‌ నియోజకవర్గ వైస్సార్‌సీపీ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి మధుసూదన్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి భార్య, పిల్లలు, తల్లిదండ్రులను పరామర్శించి అన్ని విధాలుగా తమ పార్టీ తరపున అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మధుసూదన్‌ కుటుంబానికి ప్రతాప్‌కుమార్‌రెడ్డి రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, కనమర్లపూడి వెంకటనారాయణ, అమరా వేదగిరి సుబ్బరాయుడుగుప్తా, గంధం ప్రసన్నాంజనేయులు, గుర్రం వెంకటేశ్వర్లు, నాగేశ్వరమ్మ ఉన్నారు.

వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇన్‌చార్జిల పరామర్శ

రూ.5 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement