
విశ్వకర్మలకు రూ.4కే యూనిట్ విద్యుత్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): అర్హత కలిగిన విశ్వకర్మ వృత్తుల వారికి రూ.4కే యూనిట్ విద్యుత్ను అందించనున్నట్లు, జిల్లా విద్యుత్శాఖ ఎస్ఈ చంద్రమోహన్, అఖిలభారత విశ్వకర్మ పరిషత్ జిల్లా అధ్యక్షుడు నరసింహచారి తెలిపారు. నాలుగవ కేటగిరి విద్యుత్ను రూ.4కే యూనిట్ను అందించనున్నట్లు ఎలక్ట్రిసిటీ రెగ్యులరైజేషన్ కమిషన్ గురువారం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో జిల్లా విద్యుత్శాఖ కార్యాలయంలో ఎస్ఈ చంద్రమోహన్కు పథకాన్ని వెంటనే అమలు చేయాలని విశ్వకర్మలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ చంద్రమోహన్ మాట్లాడుతూ తమ పరిధిలోని అన్ని మండలాల్లో అర్హత కలిగిన విశ్వకర్మలకు వివరాలు సేకరించి నాలుగో కేటగిరి మీటర్ ద్వారా 25 హెచ్పీ కెపాసిటీతో విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు బాలయ్య, యాదగిరి, రామచంద్రం, నాగరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.