రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

Apr 24 2025 8:44 AM | Updated on Apr 24 2025 8:44 AM

 రోడ్

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు

లారీని ఢీకొట్టిన మహిళా ఆర్‌ఎంపీ..

చేగుంట(తూప్రాన్‌): ఆగి ఉన్న లారీని స్కూటీ ఢీకొట్టిన ప్రమాదంలో మహిళా ఆర్‌ఎంపీ మృతి చెందింది. ఈ ఘటన చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీ సబ్‌ స్టేషన్‌ వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం గాజులరామారానికి చెందిన కమ్మరి మంజుల(45) ఆర్‌ఎంపీగా పని చేస్తున్నారు. ఆమె కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో ఉంటున్న తన కూతురు శృతిలయను చూసేందుకు స్కూటీపై వెళ్లింది. బుధవారం తిరుగు ప్రయాణంలో స్కూటీపై వస్తుండగా రెడ్డిపల్లికాలనీ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఆమె తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆటో..

హవేళిఘణాపూర్‌(మెదక్‌): ఆగి వున్న లారీని వెనుక నుంచి ఆటో ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని శాలిపేట గేటు సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హవేళిఘణాపూర్‌ మండల పరిధిలోని బూర్గుపల్లికి చెందిన ఆటోలో మెదక్‌ నుంచి 12 మంది ప్రయాణికులు బూర్గుపల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మండల పరిఽధిలోని శాలిపేట గేటు శివారులోకి రాగానే నిలిచి ఉన్న ఇనుప రాడ్ల లోడ్‌తో ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శాలిపేట గ్రామానికి చెందిన లక్ష్మి(54) అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్‌ రాములుకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా గుండారానికి చెందిన పెంటి, శ్రీకాంత్‌లకు మెదక్‌ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. వీరితో పాటు ఉన్న మరో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి భర్త యాదగిరి, ఒక కుమారుడు ఉన్నాడు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ సత్యనారాయణ సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డివైడర్‌ను ఢీకొట్టిన యువకుడు..

చిన్నశంకరంపేట(మెదక్‌): నార్సింగి మండలంలోని జప్తిశివనూర్‌ జాతీయ రహదారిపై బైక్‌ అదుపుతప్పి యువకుడు డివైడర్‌ను ఢీకొట్టి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నార్సింగి ఎస్‌ఐ అహ్మద్‌ మోహినోద్దీన్‌ కథనం ప్రకారం... సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట –భూపంల్లి మండలం చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన వల్లెపు సంతోష్‌(28) తన పెద్దమ్మ కుమారుడు రాజుతో కలిసి మంగళవారం రాత్రి బైక్‌పై గండిమైసమ్మ నుంచి కామారెడ్డికి బయలుదేరారు. మార్గమధ్యలో జప్తిశివనూర్‌ వద్దకు చేరుకోగానే బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యారు. వెంటనే రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డికి తరలిస్తుండగా సంతోష్‌ మృతి చెందాడు. రాజు కాలు విరగడంతో అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి1
1/3

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

 రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి2
2/3

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

 రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి3
3/3

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement