అన్ని హంగులతో కోర్టు భవనం | - | Sakshi
Sakshi News home page

అన్ని హంగులతో కోర్టు భవనం

Jun 29 2025 7:25 AM | Updated on Jun 29 2025 7:25 AM

అన్ని హంగులతో కోర్టు భవనం

అన్ని హంగులతో కోర్టు భవనం

జిన్నారం(పటాన్‌చెరు): మండల కేంద్రంలోని కోర్టు భవనాన్ని జిల్లా జడ్జి భవానిచంద్ర శనివారం పరిశీలించారు. నూతనంగా నిర్మించిన భవనంలో వసతులపై ఆరా తీశారు. వినియోగదారుల కోసం ప్రత్యేక శౌచాలయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ఛాంబర్‌ హాల్‌లో ఫర్నీచర్‌, టేబుల్స్‌ వివిధ వసతులు ఏర్పాటుకు పలు సూచనలు చేశారు. కోర్టు భవనానికి కావాల్సిన అన్ని హంగులు, వసతులు పూర్తిచేసిన అనంతరం ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, నర్సాపూర్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, అసోసియేషన్‌ సభ్యులు, తహసీల్దార్‌ దేవదాస్‌, సీఐ నయిమొద్దీన్‌, ఎస్‌ఐ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement