
ప్రణాళిక పనులు పక్కాగా సాగాలి
పట్టణ ప్రణాళిక పనులను ప్రారంభిస్తున్న నిర్మలారెడ్డి
సంగారెడ్డి: పట్టణంలో వంద రోజుల ప్రణాళిక పనులు పక్కాగా జరగాలని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని 32వ వార్డులో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనంతకిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచందర్ నాయక్, 32వ వార్డు ఇన్చార్జి సతీష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సంతోష్, మాజీ కౌన్సిలర్ రామప్ప, అధికారులు పాల్గొన్నారు.
టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి