నేడు జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

నేడు జాబ్‌మేళా

Jun 29 2025 7:25 AM | Updated on Jun 29 2025 7:25 AM

నేడు

నేడు జాబ్‌మేళా

నర్సాపూర్‌: పట్టణంలోని సాయికృష్ణ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు సేవ చేయాలన్న ఉద్దేశంతో జాబ్‌మేళా ఏర్పాటు చేసేందుకు ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చించామన్నారు. సుమారు 60 కంపెనీల ప్రతినిధులు జాబ్‌మేళాకు వస్తారని, 1,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుందన్నారు. నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యోగాలు పొందాలని సూచించారు.

మొక్కలు నాటి సంరక్షించండి

సంగారెడ్డిటౌన్‌: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అటవీ శాఖ అధికారి దేవిలాల్‌ అన్నారు. శనివారం సంగారెడ్డిలోని ఓ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీశాఖ అధికారి వేణుగోపాల్‌, పాఠశాల సిబ్బంది వేణు పాల్గొన్నారు.

బేస్‌లైన్‌ టెస్టులు

నిర్వహించాలి

జహీరాబాద్‌ టౌన్‌: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పరిక్షించేందుకు బేస్‌లైన్‌ టెస్టులు నిర్వహించాలని డీఈఓ వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం మండలంలోని హుగ్గెల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలా బోధించాలి.. వారు ఏమి నేర్చుకోవాలనే దాని గురించి ఇయర్‌ ప్లాన్‌, లెసన్‌ ప్లాన్‌, టీచింగ్‌ డైరీ, యూనిట్‌ ప్లాన్‌ రాయాలని సూచించారు. ఐఎఫ్‌పీ ప్యానె ల్‌లను వాడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అసంపూర్తిగా ఉన్న ప్రాథమిక పాఠశాల కిచెన్‌, టాయిలెట్లను పరిశీలించారు. ఆయన వెంట ఎంఈఓ మాణయ్య ఉన్నారు.

పింఛన్ల మంజూరుకు చర్యలు

నర్సాపూర్‌: అర్హులకు పింఛన్లు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని జూనియర్‌ సివిల్‌ జడ్జి హేమలత చెప్పారు. శని వారం ఆమె పట్టణంలోని విజన్‌ వృద్ధాశ్రమాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వృద్ధులను అప్యాయంగా పలకరించారు. ఏమైనా ఇబ్బందులుంటే చెప్పాలని కోరారు. దీంతో పలువురు తమకు పింఛన్‌ రావడం లేదని, ఇప్పించాలని కోరారు. అర్హులకు పింఛన్లు మంజూరు చేయించేందుకు మండల లీగల్‌ సర్వీస్‌ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వృద్ధులను ప్రేమానురాగాలతో చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

విద్యుత్‌ స్తంభాలనుపునరుద్ధరించాలి

హవేళిఘణాపూర్‌(మెదక్‌): కొన్ని రోజుల క్రితం ఈదురుగాలులతో కిందపడిపోయిన విద్యుత్‌ స్తంభాలను సరి చేసి రైతులకు సకాలంలో విద్యుత్‌ సరఫరా చేసే విధంగా చూడాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం మండల పరిధిలోని స్కూల్‌ తండా శివారులో పడిపోయిన విద్యుత్‌ స్తంభాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. విద్యుత్‌ అధికారులు స్పందించి సకాలంలో చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మేకల సాయిలు, మాజీ సర్పంచ్‌ యశోద, వార్డు సభ్యులు రవి, సాయిలు, యామిరెడ్డి, దాస్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు జాబ్‌మేళా 
1
1/3

నేడు జాబ్‌మేళా

నేడు జాబ్‌మేళా 
2
2/3

నేడు జాబ్‌మేళా

నేడు జాబ్‌మేళా 
3
3/3

నేడు జాబ్‌మేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement