ఈత సరదా.. నిండు ప్రాణం బలి | - | Sakshi
Sakshi News home page

ఈత సరదా.. నిండు ప్రాణం బలి

Jun 14 2025 10:20 AM | Updated on Jun 14 2025 10:20 AM

ఈత సరదా.. నిండు ప్రాణం బలి

ఈత సరదా.. నిండు ప్రాణం బలి

జిన్నారం (పటాన్‌చెరు): ఈత సరదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నది. ఈ ఘటన గుమ్మడిదల పరిధిలోని అన్నారం గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లా గాగిల్లాపూర్‌కు చెందిన గులాం హుస్సేన్‌ (35) స్థానికంగా కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొట్టేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. స్విమ్మింగ్‌ శిక్షకులు లేకపోవడంతో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు, బాధితులు వాపోయారు. మండలంలో అనధికారికంగా కొనసాగుతున్న స్విమ్మింగ్‌ పూల్స్‌ను గుర్తించి యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement