
పాఠశాల భవనం ప్రారంభం
చిన్నశంకరంపేట(మెదక్): మండల పరిధిలోని సూరారంలో శుక్రవారం పాఠశాల భవనాన్ని వీఎస్టీ ప్రతినిధులు అనిష్గుప్తా, అమిత్ ఆరోర, శాంతి, కార్తీక్లు ప్రారంభించారు. వీఎస్టీ యాజమాన్యం రూ.70లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించింది. సూరారం జెడ్పీపాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి శిథిలమైన పాఠశాల భవనం గురించి రౌండ్ టేబుల్ స్వచ్ఛంద సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి విషయం తెలుసుకున్న వీఎస్టీ యాజమాన్యం ముందుకు వచ్చింది. రూ.60 లక్షలు వెచ్చించి మూడు తరగతి గదులు, రూ.10 లక్షల నిధులతో టాయిలెట్స్ను నిర్మించింది. గ్రామస్తుల సమక్షంలో పాఠశాల భవనాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం వీఎస్టీ సంస్థ ప్రతినిధులు, రౌండ్టేబుల్ స్వచ్ఛంద సంస్ధ ప్రతినిధులను సత్కరించింది.
రూ.70లక్షల వ్యయంతో వీఎస్టీ సంస్థ నిర్మాణం
సత్కరించిన ఉపాధ్యాయ బృందం