
నాడు భర్త.. నేడు భార్య
శివ్వంపేట(నర్సాపూర్): ఆత్మహత్యకు యత్నించిన దంపతులు చికిత్స పొందుతూ మృతి చెందారు. పదిరోజుల క్రితం పాపన్నపేట మండలం ఏడుపాయల్లో పురుగుల మందు తాగి ఆత్మహ త్యకు యత్నించిన విషయం విధితమే. మండల పరిధిలోని పోతులబోగూడ గ్రామానికి చెందిన పందుల శివకుమార్(40) అతని భార్య శోభ (35) ఆత్మహత్యకు యత్నించారు. గుర్తించిన స్థానికులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా మరుసటి రోజు శివకుమార్ మృతిచెందాడు. భార్య శోభ గురువారం మృతి చెందడంతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు.
భూ సమస్యలతో మనస్తాపానికి గురై..
పెద్దశంకరంపేట(మెదక్): భూ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ.ప్రవీణ్రెడ్డి కథనం ప్రకారం... ఝరాసంఘం మండలం కక్కెరవాడకు చెందిన రాజు(26)తో కొత్తపేటకు చెందిన బాలమణికి గతంలో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం అతడు కొత్తపేటలో నివాసం ఉంటున్నాడు. రాజు తన సొంత గ్రామానికి భూ సమస్యల విషయంపై వెళ్లి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్యకు యత్నించిన దంపతులు మృతి

నాడు భర్త.. నేడు భార్య