ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

Jun 14 2025 10:20 AM | Updated on Jun 14 2025 10:20 AM

ప్రభు

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఒకటవ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం విద్యార్థులకు ఉచిత పాఠ్య, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు , సమగ్ర శిక్ష సీఎంవో వెంకటేశం, సంగారెడ్డి మండల విద్యాధికారి విద్యాసాగర్‌, ప్రధానోపాధ్యాయురాలు సునీతతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

కోంటూర్‌ ప్రాథమిక పాఠశాలలో..

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మెదక్‌ మండల పరిధిలోని కోంటూర్‌ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించినట్లు ప్రధానోపాధ్యాయురాలు సంగీత తెలిపారు. అలాగే నోట్‌బుక్‌లు, పాఠ్యపుస్తకాలు అందించారు. ఉపాధ్యాయులు ప్రవళిక, రేవతి పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య1
1/1

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement