
మోగింది బడి గంట
దాదాపు నెలన్నర రోజుల వేసవి సెలవులు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా బడులు గురువారం పునఃప్రారంభమయ్యాయి. బడిగంటలు మోగడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. తమతో కలిసి చదివిన స్నేహితులను కలుసుకున్నారు. ఒకరికొకరు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గురువులకు పాదాభివందనం చేశారు. తొలిరోజు కావటంతో పాఠశాలలకు తోరణాలు కట్టి విద్యార్థులను టీచర్లు ఆహ్వానించారు. చిన్న పిల్లలు మాత్రం పాఠశాలకు రావడానికి అయిష్టం వ్యక్తం చేశారు. కొందరు ఆడుతూ కనిపించారు. మరి కొందరు ఇంటికి వెళ్తామని మారాం చేశారు. బడులు తెరిచిన రోజే జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలను ఉపాధ్యాయులు అందజేశారు. అందోల్ మండలం నేరుడుగుంట ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ వల్లూరు క్రాంతి విద్యార్థులు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు.
సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి
బడిగంట మోగడంతో లోపలికి వెళ్తున్న విద్యార్థులు