
ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వివేక్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వివేక్ వెంకటస్వామి నియమితులయ్యారు. ఇప్పటివరకు జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన కొండా సురేఖ స్థానంలో వివేక్ను నియమిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అమాత్య పదవి దక్కిన సంగతి తెలిసిందే.
మంత్రిని కలిసిన దళిత సంఘాల నాయకులు
జహీరాబాద్ టౌన్: రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ను జహీరాబాద్ దళిత సంఘాల నాయకులు హైదరాబాద్లోని మంత్రి నివాసంలో గురువారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.