పేదలకే ఇందిరమ్మ ఇళ్ల్లు | - | Sakshi
Sakshi News home page

పేదలకే ఇందిరమ్మ ఇళ్ల్లు

Jun 12 2025 11:04 AM | Updated on Jun 12 2025 11:04 AM

పేదలకే ఇందిరమ్మ ఇళ్ల్లు

పేదలకే ఇందిరమ్మ ఇళ్ల్లు

గురువారం శ్రీ 12 శ్రీ జూన్‌ శ్రీ 2025
ఎంపీ షెట్కార్‌, ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్‌: అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి వారి సొంతింటి కల నెరవేర్చనున్నట్లు జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్‌ మున్సిపాలిటీ పరిధిలోని చాంద్‌ఖాన్‌పల్లి, శాసీ్త్రనగర్‌, నెహ్రూనగర్‌, వెంకటాపూర్‌ గ్రామాల్లో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ గృహాలను కేటాయిస్తున్నామన్నారు. పేదలు పథకాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఇంటి కల నెరవేర్చుకోవాలని సూచించారు. గృహాలు అర్హులకే దక్కాలనే సంకల్పంతో డిజిటల్‌ విధానంతో ఫొటో క్యాప్చరింగ్‌ చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు వారు పలు వార్డుల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఆనంద్‌ స్వరూప్‌ షెట్కార్‌, మాజీ వైస్‌ చైర్మన్‌ దారం శంకర్‌, మాజీ ఎంపీటీసీలు పండరీరెడ్డి, రమేశ్‌ చౌహన్‌, తాహెర్‌, ముంతాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement