పట్టు బట్టారు.. ర్యాంకు సాధించారు | - | Sakshi
Sakshi News home page

పట్టు బట్టారు.. ర్యాంకు సాధించారు

Jun 11 2025 11:52 AM | Updated on Jun 11 2025 11:52 AM

పట్టు

పట్టు బట్టారు.. ర్యాంకు సాధించారు

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌)/ బెజ్జంకి(సిద్దిపేట): ఇద్దరిది ఒకే ఊరు..మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారే.కలలు కన్నారు.. ర్యాంకు సాధించారు. సోమవారం విడుదల చేసిన ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ ప్రవేశపరీక్షల్లో హర్షవర్ధన్‌ మొదటి ర్యాంకు సాధించగా, శివప్రసాద్‌ 6వ ర్యాంకు సాధించాడు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామానికి చెందిన కర్రావుల హర్షవర్ధన్‌ జగదేవ్‌పూర్‌ మండలంలోని తిగుల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. 2022లో కూడా ఓయూ పీహెచ్‌డీ ప్రవేశపరీక్షలో స్టేట్‌ మొదటి ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం కెమిస్ట్రీ ప్రవేశపరీక్ష రాసి మళ్లీ స్టేట్‌ మొదటి ర్యాంకు పొందాడు. ర్యాంకు రావడం పట్ల సంతోషంగా ఉందని, తన కష్టం వెనుక అమ్మనాన్నల ఆశీర్వాదం ఉందని ఆనందం వ్యక్తం చేశాడు.

శివప్రసాద్‌కు 6వ ర్యాంకు..

గుండారం గ్రామానికి చెందిన బొల్లి శివప్రసాద్‌ జగదేవ్‌పూర్‌ మండలంలోని గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్నాడు. ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో ఫీలాసఫీలో స్టేట్‌ 6వ ర్యాంకు సాధించాడు. మొదటి సారి పరీక్ష రాసి ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని తెలిపాడు.

పట్టు బట్టారు..  ర్యాంకు సాధించారు 1
1/1

పట్టు బట్టారు.. ర్యాంకు సాధించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement