
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
వెల్దుర్తి(తూప్రాన్) : ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని ఎల్కపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై రాజు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మంద స్వామి(42) తనకున్న అరెకరంలో వ్యవసాయంతోపాటు తాపీమేసీ్త్రగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సుమారు రెండేళ్ల క్రితం పెద్ద కూతురు వివాహం చేయడానికి తెచ్చిన అప్పులతో పాటు రేకుల ఇంటి నిర్మాణానికి తెచ్చిన అప్పులు ఎక్కువయ్యాయి. పంట చిట్టీలకు చెల్లించడానికి డబ్బులు సమకూరకపోవడం, మరో ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉండటం భవిష్యత్తులో వారి వివాహాలు ఎలా చేయాలో మదనపడుతుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ శివారులోని ఖాన్ చెరువు సమీపంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మద్యానికి బానిసై ..
పటాన్చెరు టౌన్: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకట్రెడ్డి వివరాల ప్రకారం... రామేశ్వరంబండా గ్రామానికి చెందిన భరత్ గౌడ్ (26) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం సాయంత్రం మద్యం తాగి వచ్చి తన ఆటోను స్టార్ట్ చేసేందుకు ఉపయోగించే తాడుతో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో యువకుడు..
వర్గల్(గజ్వేల్): కుటుంబ గొడవలతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వర్గల్ మండలం నెంటూరులో జరిగింది. బేగంపేట ఎస్ఐ మహిపాల్రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లింగ స్వామి, సంతోష దంపతుల పెద్ద కొడుకు సాయికిరణ్(20) ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే కుటుంబ గొడవలతో మనస్తాపానికి గురయ్యాడు. సాయికిరణ్ రోజు మాదిరిగా పనికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. సోమవారం సాయంత్రం గ్రామ శివారులో వ్యవసాయ భూమిలో ఉన్న వేప చెట్టుకు చీరతో ఉరేసుకున్నాడు. మంగళవారం ఉదయం గ్రామస్తులు గమనించి కుటుంబీకులకు తెలియజేశారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య