ఇంట్లో నుంచి వెళ్లి.. ఎర్రకుంటలో శవమై | - | Sakshi
Sakshi News home page

ఇంట్లో నుంచి వెళ్లి.. ఎర్రకుంటలో శవమై

Jun 11 2025 11:52 AM | Updated on Jun 11 2025 11:52 AM

ఇంట్లో నుంచి వెళ్లి.. ఎర్రకుంటలో శవమై

ఇంట్లో నుంచి వెళ్లి.. ఎర్రకుంటలో శవమై

గజ్వేల్‌రూరల్‌: భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి ఎర్రకుంటలో శవమై కనిపించాడు. ఈ ఘటన గజ్వేల్‌ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పట్టణంలోని రహమత్‌నగర్‌కు చెందిన గుంటుకు రాంచందర్‌(70) తన భార్య సత్తవ్వతో గొడవపడి ఈనెల 6న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిసిన చోట వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పట్టణంలోని ఎర్రకుంటలో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు రాంచందర్‌గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి..

సంగారెడ్డి క్రైమ్‌: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేష్‌ వివరాల ప్రకారం.. భవానీనగర్‌కు చెందిన గొగికర్‌ ఈశ్వర్‌, కళాబాయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కొడుకు గొగికర్‌ రాకేష్‌ (35) వృత్తిరీత్యా చికెన్‌ షాప్‌ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం శంకర్‌పల్లికి చెందిన రేవతితో వివాహం జరగగా పాప ఉంది. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 20 రోజుల క్రితం రేవతి పాపను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. ఆదివారం చికెన్‌ షాపునకు వెళ్లిన రాకేష్‌ రాత్రి 12 గంటల సమయంలో మద్యం తాగి ఇంటికి వచ్చి పడుకున్నాడు. సోమవారం కుటుంబ సభ్యులు రూమ్‌ తలుపులు తడితే తీయలేదు. దీంతో తలుపులు పగులగొట్టి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement