రైతుల కోసమే రెవెన్యూ సదస్సులు | - | Sakshi
Sakshi News home page

రైతుల కోసమే రెవెన్యూ సదస్సులు

Jun 11 2025 11:51 AM | Updated on Jun 11 2025 11:51 AM

రైతుల

రైతుల కోసమే రెవెన్యూ సదస్సులు

సీడీసీ చైర్మన్‌ రాంరెడ్డి

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): గ్రామాల్లో రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు సీడీసీ చైర్మన్‌ రాంరెడ్డి తెలిపారు. మండలంలోని కంభాలపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్‌ సరస్వ తితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవా లని సూచించారు. ప్రభుత్వం తెచ్చిన భూ భారతితో సమస్యలు పరిష్కారం కానున్నాయ న్నారు. భూ భారతి చట్టంతో ప్రజలకు మెరు గైన సేవలు అందుతాయన్నారు. రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులు చేసిన వారికీ రశీదు లు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ గంగాధర్‌, నాయకులు బాబు, అంజన్న, భీంసేన్‌రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఊపందుకున్న

ఇందిరమ్మ ఇళ్ల పనులు

జహీరాబాద్‌ టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గులు పోసి పూనాదుల పనులు ఊరూరా ఊపందుకున్నాయి. జహీరాబాద్‌, మొగుడంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఇళ్ల నిర్మాణానికి ఖాళీ స్థలం అందుబాటులో ఉన్న లబ్ధిదారులకు సర్టిఫికెట్లను అంద జేశారు. లబ్ధిదారుల స్థలాల వద్ద ముగ్గు వేసి పునాది పనులు ప్రారంభించారు. రెండు మండలాల్లో పదుల సంఖ్యలో నిర్మాణాలు మొదలయ్యాయి. మండల కేంద్రమైన మొగుడంపల్లిలో లబ్ధిదారులకు ఇళ్ల సర్టిఫికెట్లు అందజేసి, ముగ్గులు వేశారు.

కార్పొరేట్‌ ప్రయోజనాలకే లేబర్‌ కోడ్‌లు

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ ప్రయోజనాలకే లేబర్‌ కోడ్‌లను తీసుకువస్తుందని వీటి రద్దు కోసం జూలై 9న జరగను న్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో కనీస వేతనాలు, ఉద్యోగ భద్ర త లేక కార్మికుల జీవితాలు దుర్భరం అయ్యా యని వాపోయారు. లేబర్‌ కోడ్‌లు అమలు చేస్తే కనీసం కార్మికులు తమ సమస్యలపై నిరసన కూడా తెలియజేసే అవకాశం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

మోదీ పాలనలో

ఎంతో అభివృద్ధి

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌

హత్నూర(సంగారెడ్డి): ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో దేశం ఎంతగానో అభివృద్ధి జరిగిందని బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌ పేర్కొన్నారు. హత్నూర మండల బీజేపీ మండల అధ్యక్షులు నాగప్రభు ఆధ్వర్యంలో మోదీ ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హత్నూర మండలం దౌల్తా బాద్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రమేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. మోదీ 11 ఏళ్ల పాలన అమృతకాలమని ఎన్నో అసాధ్యం కాని నిర్ణయాలు తీసుకుని సుసాఽ ద్యం చేసి దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత మోదీనేన్నారు.

రైతుల కోసమే రెవెన్యూ సదస్సులు1
1/3

రైతుల కోసమే రెవెన్యూ సదస్సులు

రైతుల కోసమే రెవెన్యూ సదస్సులు2
2/3

రైతుల కోసమే రెవెన్యూ సదస్సులు

రైతుల కోసమే రెవెన్యూ సదస్సులు3
3/3

రైతుల కోసమే రెవెన్యూ సదస్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement