
నకిలీ విత్తన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి
కొండాపూర్(సంగారెడ్డి): నకిలీ విత్తన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దశరథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కొండాపూర్లో తహసీల్దార్ అశోక్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ...మండలంలోని పల్లెలను, గ్రామాలను ఆసరాగా చేసుకుని నకిలీ విత్తన వ్యాపారులు చెలరేగిపోతున్నారన్నారు. రైతులను మోసం చేసేందుకు కాలం చెల్లిన మందులను, నకిలీ విత్తనాలను అంటగడుతున్నారని మండిపడ్డారు. సీపీఐ రైతు సంఘం జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి మాట్లాడుతూ... కొండాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు పెండింగ్ వేతనాలు తక్షణమే స్పందించి పెండింగ్ వేతనాలు అందేలా చూడాలని కోరారు.