
డిప్యూటీ స్పీకర్కు సన్మానం
నారాయణఖేడ్: డిప్యూటీ స్పీకర్గా ఇటీవల నియమితులైన రాంచందర్ నాయక్ను మంగళవారం హైదరాబాద్లోని బంజారాసేవాలాల్ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రమేశ్చౌహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాంచందర్ నాయక్ను డిప్యూటీ స్పీకర్గా నియమించడం పార్టీకి గిరిజనుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన తెలిపారు. రాంచదర్నాయక్ను కలిసిన వారిలో సంఘం నాయకులు లక్ష్మణ్ చౌహన్, మోహన్ రాథోడ్ ఆయన వెంట ఉన్నారు.