
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
హత్నూర (సంగారెడ్డి): విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందింది. ఈ ఘటన మండల కేంద్రమైన హత్నూరలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మంగలి నరసింహులు వారం రోజుల క్రితం టేక్మాల్ పశువుల సంతలో 1.50 లక్షలు పెట్టి రెండు ఎడ్లను కొనుగోలు చేశాడు. ఆదివారం గ్రామ శివారులో మేత కోసం రెండు ఎడ్లను తీసుకొని వెళ్లాడు. ట్రాన్స్ఫార్మర్ కింద ఓ ఎద్దు మేత మేసేందుకు వెళ్లడంతో విద్యుత్ షాక్కు గురై మృత్యువాత పడింది. దీంతో కళ్ల ఎదుటే లక్షల రూపాయలు పెట్టి తెచ్చిన ఎద్దు మృతి చెందడంతో బాధితుడు బోరున విలపించాడు.