వర్గల్(గజ్వేల్): హుస్నాబాద్ రైతు మహోత్సవంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లు, ప్రదర్శనలను ఆదివారం మండల రైతులు తిలకించారు. ములుగు ఏడీఏ అనిల్కుమార్, వ్యవసాయాధికారి శేషశయన ఆధ్వర్యంలో వివిధ క్లస్టర్ల నుంచి 200 పైచిలుకు రైతులు తరలివెళ్లారు. వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన వివిధ యంత్రాలు, డ్రోన్ పరికరాలను పరిశీలించారు. స్టాళ్లలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైన కొత్త వంగడాల గురించి తెలుసుకున్నారు. వారి వెంట ఏఈఓలు సంతోష్, సునీత, భారతి, మానస, సుప్రజ, తేజస్వి ఉన్నారు.
రైతు మహోత్సవంలో వర్గల్ రైతులు